ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
- September 04, 2024
న్యూఢిల్లీ: దేశంలో ఇటివల పాఠశాలలు, విమానాలు, ప్రముఖులకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్ఫోర్ట్కు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో అధికారులు వెంటనే విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానం విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అధికారులు ప్రయాణికుల్ని దింపేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. దీంతో ఆ బెదిరింపు కాల్ బూటకమని అధికారులు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు









