వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!
- September 04, 2024
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్కి తొలి సినిమా ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేదింతవరకూ. ‘ఉప్పెన’ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టాడీ కుర్ర హీరో.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద సో సోగా నిలిచాయ్. తాజాగా వైష్ణవ్ తేజ్ ఓ కొత్త కథతో రాబోతున్నాడనీ తెలుస్తోంది.
వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆ క్రమంలోనే కృష్ణ చైతన్య నెరేట్ చేసిన ఓ కథకు ఓకే చేశాడనీ తాజా సమాచారం.
ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కథ పరంగా చూస్తే ఓ కొత్త నేపథ్యమున్న కథనీ తెలుస్తోంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి లేటెస్ట్గా దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా కృష్ణ చైతన్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.
కానీ, వైష్ణవ్ తేజ్ని మాత్రం ఓ కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలింకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







