వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!
- September 04, 2024
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్కి తొలి సినిమా ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేదింతవరకూ. ‘ఉప్పెన’ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టాడీ కుర్ర హీరో.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద సో సోగా నిలిచాయ్. తాజాగా వైష్ణవ్ తేజ్ ఓ కొత్త కథతో రాబోతున్నాడనీ తెలుస్తోంది.
వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆ క్రమంలోనే కృష్ణ చైతన్య నెరేట్ చేసిన ఓ కథకు ఓకే చేశాడనీ తాజా సమాచారం.
ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కథ పరంగా చూస్తే ఓ కొత్త నేపథ్యమున్న కథనీ తెలుస్తోంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి లేటెస్ట్గా దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా కృష్ణ చైతన్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.
కానీ, వైష్ణవ్ తేజ్ని మాత్రం ఓ కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలింకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







