వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!
- September 04, 2024
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్కి తొలి సినిమా ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేదింతవరకూ. ‘ఉప్పెన’ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టాడీ కుర్ర హీరో.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద సో సోగా నిలిచాయ్. తాజాగా వైష్ణవ్ తేజ్ ఓ కొత్త కథతో రాబోతున్నాడనీ తెలుస్తోంది.
వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆ క్రమంలోనే కృష్ణ చైతన్య నెరేట్ చేసిన ఓ కథకు ఓకే చేశాడనీ తాజా సమాచారం.
ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కథ పరంగా చూస్తే ఓ కొత్త నేపథ్యమున్న కథనీ తెలుస్తోంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి లేటెస్ట్గా దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా కృష్ణ చైతన్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.
కానీ, వైష్ణవ్ తేజ్ని మాత్రం ఓ కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలింకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …