వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే.!
- September 04, 2024
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్కి తొలి సినిమా ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేదింతవరకూ. ‘ఉప్పెన’ సినిమాతో రికార్డులు బద్దలుకొట్టాడీ కుర్ర హీరో.
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద సో సోగా నిలిచాయ్. తాజాగా వైష్ణవ్ తేజ్ ఓ కొత్త కథతో రాబోతున్నాడనీ తెలుస్తోంది.
వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచి తూచి కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆ క్రమంలోనే కృష్ణ చైతన్య నెరేట్ చేసిన ఓ కథకు ఓకే చేశాడనీ తాజా సమాచారం.
ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కథ పరంగా చూస్తే ఓ కొత్త నేపథ్యమున్న కథనీ తెలుస్తోంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి లేటెస్ట్గా దర్శకత్వం వహించాడు కృష్ణ చైతన్య. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా దర్శకుడిగా కృష్ణ చైతన్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.
కానీ, వైష్ణవ్ తేజ్ని మాత్రం ఓ కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలింకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







