గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి అలర్ట్.. ఇక పై వీకెండ్ క్రూయిజ్ లు !
- September 06, 2024
గల్ఫ్ దేశాల్లో ఉన్నవారికి కీలక బిగ్ అప్డేట్ వచ్చింది.రిసార్ట్స్ వరల్డ్ క్రూయిజ్ లలో ప్రయాణించాలనుకునే వారి కోసం గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం, రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. నవంబర్ 1, 2024 నుండి గల్ఫ్లో రిసార్ట్స్ వరల్డ్ వన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్. నవంబర్ 1, 2024 నుండి ఏప్రిల్ 2025 ఉంటుందని కూడా ప్రకటించారు.అది కూడా మిడిల్ ఈస్ట్లో అరంగేట్రం చేయనుంది రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్.ఇందులో భాగంగానే దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజంతో ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు దుబాయ్లో క్రూయిస్ లైన్ ప్రారంభ విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. టూరిస్టుల కోసం మూడు రకాల క్రూయిజ్లను ప్రారంభించేందుకు సిద్ధం అయింది రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్. వీటిలో రెండు రాత్రుల పాటు ప్రయాణించే సర్ బని యాస్ వీకెండ్ క్రూయిజ్ ప్రతి శుక్రవారం బయలుదేరుతుంది. 3 నైట్ ఒమన్ (ఖాసబ్-మస్కట్) క్రూజ్ ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. 2 నైట్ దోహా క్రూజ్ ప్రతి బుధవారం బయలుదేరుతుంది. ఇక ప్రయాణీకులు 4, 5 లేదా వారం రోజుల పాటు ట్రిప్ వెళ్ళడానికి ప్రత్యేక క్రూయిజ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రకటన చేసింది. ఇక తమ క్రూయిసెస్ లలో అన్ని వసతులు ఉంటాయని తెలిపింది రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్.
ఇక దీని పై రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రెసిడెంట్ మైఖేల్ గోహ్ మాట్లాడుతూ...నవంబర్ 1న రిసార్ట్స్ వరల్డ్ వన్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ పై గల్ఫ్ అలాగే ఆసియా దేశాలు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రెసిడెంట్ మైఖేల్ గోహ్.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి