వాహనదారులకు గుడ్ న్యూస్....
- September 06, 2024
భారతదేశంలో ప్రతి ఒక్క వాహనదారులకు అతి త్వరలోనే అదిరిపోయే శుభవార్త రానుంది. డీజిల్, పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. గురువారం రోజున పలు ఆంగ్ల టెలివిజన్ చానల్లలో ఈ విషయం గురించి తెలిసిన సమాచారాన్ని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ మీద రూ. 2 రూపాయల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వచ్చాయి. అంతకు ముందు మాత్రం దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడుకొన్ని ఒడుదోడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరగడం జరిగింది. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా.....స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!