వరద బాధితులక అండగా 15 మిలియన్ దిర్హామ్ బిగ్ టికెట్ విజేతలు..!
- September 07, 2024
యూఏఈ: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కు చెందిన 36 మంది వ్యక్తుల బృందం తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్లో సమిష్టిగా 15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ లో కొంతభాగాన్ని వారి స్వదేశంలో వరద బాధితులకు తక్షణ సహాయం ఉపయోగిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఈ బృందం తమ డబ్బును పోగేసి టిక్కెట్లను కొనుగోలు చేసింది. నూర్ మియా 25 దిర్హామ్లు అందించి, 350,000 దిర్హామ్లను పొందాడు. ఇతర గ్రూప్ సభ్యులు Dh25, Dh70 చందాలు వేసి బహుమతిలో వారి వాటాను పొందారు. "అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము" అని మియా చెప్పారు. ఈ విజయం మా కోసమే కాదు - కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అని బృందం సభ్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









