సౌదీ అరేబియాలో 23,871 మందిపై పాస్పోర్ట్ డైరెక్టరేట్ చర్యలు..!
- September 09, 2024
రియాద్: గత హిజ్రీ నెల సఫర్లో నిబంధనలు ఉల్లంఘించిన 23,871మందిపై చర్యలు తీసుకున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలలో పాస్పోర్ట్ విభాగాల ఆధ్వర్యంలోని అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు రెసిడెన్సీ లా, లేబర్ లా, బోర్డర్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులకు జైలుశిక్ష, జరిమానాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రవాసులు జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ సందర్భంగా రవాణా, ఉద్యోగం లేదా ఆశ్రయం ఇవ్వవద్దని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలోని ఫోన్ నంబర్ 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్కు ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







