సౌదీ అరేబియాలో 23,871 మందిపై పాస్పోర్ట్ డైరెక్టరేట్ చర్యలు..!
- September 09, 2024
రియాద్: గత హిజ్రీ నెల సఫర్లో నిబంధనలు ఉల్లంఘించిన 23,871మందిపై చర్యలు తీసుకున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలలో పాస్పోర్ట్ విభాగాల ఆధ్వర్యంలోని అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు రెసిడెన్సీ లా, లేబర్ లా, బోర్డర్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులకు జైలుశిక్ష, జరిమానాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రవాసులు జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ సందర్భంగా రవాణా, ఉద్యోగం లేదా ఆశ్రయం ఇవ్వవద్దని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలోని ఫోన్ నంబర్ 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్కు ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









