12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!
- September 11, 2024
డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్లో 12 సంవత్సరాల క్రితం సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మూసివేసిన తన రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. సిరియాలోని సౌదీ ఛార్జ్ డి అఫైర్స్ యాక్టింగ్ అబ్దుల్లా అల్-హరీస్ అధికారికంగా ఎంబసీని ప్రారంభించారు. రెండు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా అల్-హరీస్ అభివర్ణించారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కీలక ముందడుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరియా విదేశాంగ వ్యవహారాల మంత్రి అయ్యమన్ రాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా.. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ ఏడాది మేలో సిరియాలో సౌదీ రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్-ముజ్ఫెల్ను నియమించారు. సిరియా కూడా సౌదీ అరేబియాకు కొత్త రాయబారిగా డాక్టర్ ముహమ్మద్ సౌసాన్ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో డాక్టర్ సౌసాన్ రియాద్లో బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2023లో తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని సౌదీ అరేబియా, సిరియా ప్రకటించాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు