సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు క్షమాభిక్ష పథకం వర్తిస్తుందా?
- September 11, 2024
యూఏఈ: యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకున్నారు. అయితే, సెప్టెంబరు 1 తర్వాత జరిగే ఉల్లంఘనలు, జరిమానాలను క్షమాభిక్ష కవర్ చేస్తుందా అనే విషయం గురించి నిపుణుల వివరణ ఇచ్చారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రకారం.. సెప్టెంబరు 1 తర్వాత జరిగిన ఉల్లంఘనలు పథకం పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అర్హత కలిగిన క్షమాభిక్ష దరఖాస్తుదారులకు అడ్మినిస్ట్రేటివ్, ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్, ID కార్డ్, వర్క్ కాంట్రాక్ట్ సంబంధిత జరిమానాల నుండి మినహాయింపు ఇచ్చారు.
ICP ప్రకారం.. క్షమాభిక్ష సెప్టెంబరు 1 నుండి అక్టోబర్ 30 వరకు వర్తిస్తుంది. ఈ కాలంలో అక్రమ నివాసితులు తమ స్థితిని క్రమబద్ధీకరించకుంటే, అన్ని సంబంధిత జరిమానాలు వర్తించవు. ఎగ్జిట్ పాస్ వచ్చిన 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. గడువు ముగిసిన లేదా చెల్లని రెసిడెన్సీ పర్మిట్లు ఉన్నవారు, వీసాల గడువు ముగిసిన వ్యక్తులు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ నిలిపివేత నివేదికలలో పేరు ఉన్నవారు, పుట్టిన నాలుగు నెలలలోపు రెసిడెన్సీ నమోదు చేసుకోని విదేశీయులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రేస్ పీరియడ్లో తమ వీసా స్థితిని క్రమబధ్దికరించుకుంటే అలాంటి వారిపై రీ-ఎంట్రీ నిషేధాన్ని విధించారు. వారు చెల్లుబాటు వీసాతో ఎప్పుడైనా యూఏఈలోకి అడుగుపెట్టవచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









