స్కూల్ స్టడీ బుక్లెట్ల అమ్మకాలను నిషేధించిన విద్యా మంత్రిత్వ శాఖ..!!
- September 14, 2024
మనామా: కొన్ని దుకాణాలు లేదా స్టేషనరీ అవుట్లెట్ల నుండి తల్లిదండ్రులు స్టడీ బుక్లెట్లను కొనుగోలు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ మెటీరియల్లను ముద్రించడం, విక్రయించడం చేయకుండా పాఠశాలలపై నిషేధం విధించారు. రివిజన్ గైడ్లను రూపొందించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో వాటిని ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. ఈ బుక్లెట్లు రోజువారీ చదువుకు సంబంధం లేవని, పూర్తిగా ఐచ్ఛికమని తెలిపింది. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు పూర్తి పాఠ్యాంశాలపై ఆధారపడే విద్యార్థుల చదువులపై వీటి ప్రభావం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు పాటించని స్టేషనరీ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టడీ బుక్లెట్లను కొనుగోలు చేయమని ఒత్తిడి చేసే స్కూల్, టీచర్ వివరాలను మంత్రిత్వ శాఖకు [email protected] ఇమెయిల్ ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







