స్కూల్ స్టడీ బుక్లెట్ల అమ్మకాలను నిషేధించిన విద్యా మంత్రిత్వ శాఖ..!!
- September 14, 2024
మనామా: కొన్ని దుకాణాలు లేదా స్టేషనరీ అవుట్లెట్ల నుండి తల్లిదండ్రులు స్టడీ బుక్లెట్లను కొనుగోలు చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ మెటీరియల్లను ముద్రించడం, విక్రయించడం చేయకుండా పాఠశాలలపై నిషేధం విధించారు. రివిజన్ గైడ్లను రూపొందించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో వాటిని ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. ఈ బుక్లెట్లు రోజువారీ చదువుకు సంబంధం లేవని, పూర్తిగా ఐచ్ఛికమని తెలిపింది. పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు పూర్తి పాఠ్యాంశాలపై ఆధారపడే విద్యార్థుల చదువులపై వీటి ప్రభావం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు పాటించని స్టేషనరీ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టడీ బుక్లెట్లను కొనుగోలు చేయమని ఒత్తిడి చేసే స్కూల్, టీచర్ వివరాలను మంత్రిత్వ శాఖకు [email protected] ఇమెయిల్ ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









