బహ్రెయిన్లో నకిలీ యూఎస్ డాలర్ల చెలామణి..వ్యాపారవేత్తకు జైలుశిక్ష..!!
- September 17, 2024
మనామా: నకిలీ యూఎస్ డాలర్లను దేశంలో చెలామణి చేసిన కేసులో బహ్రెయిన్ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా నకిలీ కరెన్సీని చెలామణి చేయాలనే ఉద్దేశ్యంతో బహ్రెయిన్లోకి తీసుకువచ్చాడని కోర్టు నిర్ధారించింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. వ్యాపారవేత్త నకిలీ $500 బిల్లులతో బహ్రెయిన్లోకి ప్రవేశించి, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాప్కు వెళ్లాడు. అతను $750 విలువైన ఐదు పెర్ఫ్యూమ్లను కొనుగోలు చేశాడు. నకిలీ కరెన్సీని ఉపయోగించి $200కి సిగరెట్లను కొనుగోలు చేశాడు. క్యాషియర్కు అనుమానం వచ్చి ఎయిర్పోర్టు సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, డ్యూటీ ఫ్రీ షాప్ మేనేజర్ అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డాలర్లు నకిలీవని తనకు తెలియదని చెప్పాడు. కానీ, హై క్రిమినల్ కోర్ట్ తన తీర్పులో నిందితుడు నకిలీ కరెన్సీని ఉద్దేశపూర్వక చెలామణి చేయడానికి ప్రయత్నించాడని నిర్ధారించింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ, ఇతర వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









