బహ్రెయిన్లో నకిలీ యూఎస్ డాలర్ల చెలామణి..వ్యాపారవేత్తకు జైలుశిక్ష..!!
- September 17, 2024
మనామా: నకిలీ యూఎస్ డాలర్లను దేశంలో చెలామణి చేసిన కేసులో బహ్రెయిన్ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా నకిలీ కరెన్సీని చెలామణి చేయాలనే ఉద్దేశ్యంతో బహ్రెయిన్లోకి తీసుకువచ్చాడని కోర్టు నిర్ధారించింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. వ్యాపారవేత్త నకిలీ $500 బిల్లులతో బహ్రెయిన్లోకి ప్రవేశించి, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాప్కు వెళ్లాడు. అతను $750 విలువైన ఐదు పెర్ఫ్యూమ్లను కొనుగోలు చేశాడు. నకిలీ కరెన్సీని ఉపయోగించి $200కి సిగరెట్లను కొనుగోలు చేశాడు. క్యాషియర్కు అనుమానం వచ్చి ఎయిర్పోర్టు సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, డ్యూటీ ఫ్రీ షాప్ మేనేజర్ అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డాలర్లు నకిలీవని తనకు తెలియదని చెప్పాడు. కానీ, హై క్రిమినల్ కోర్ట్ తన తీర్పులో నిందితుడు నకిలీ కరెన్సీని ఉద్దేశపూర్వక చెలామణి చేయడానికి ప్రయత్నించాడని నిర్ధారించింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ, ఇతర వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









