బహ్రెయిన్లో నకిలీ యూఎస్ డాలర్ల చెలామణి..వ్యాపారవేత్తకు జైలుశిక్ష..!!
- September 17, 2024
మనామా: నకిలీ యూఎస్ డాలర్లను దేశంలో చెలామణి చేసిన కేసులో బహ్రెయిన్ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా నకిలీ కరెన్సీని చెలామణి చేయాలనే ఉద్దేశ్యంతో బహ్రెయిన్లోకి తీసుకువచ్చాడని కోర్టు నిర్ధారించింది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం.. వ్యాపారవేత్త నకిలీ $500 బిల్లులతో బహ్రెయిన్లోకి ప్రవేశించి, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాప్కు వెళ్లాడు. అతను $750 విలువైన ఐదు పెర్ఫ్యూమ్లను కొనుగోలు చేశాడు. నకిలీ కరెన్సీని ఉపయోగించి $200కి సిగరెట్లను కొనుగోలు చేశాడు. క్యాషియర్కు అనుమానం వచ్చి ఎయిర్పోర్టు సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, డ్యూటీ ఫ్రీ షాప్ మేనేజర్ అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డాలర్లు నకిలీవని తనకు తెలియదని చెప్పాడు. కానీ, హై క్రిమినల్ కోర్ట్ తన తీర్పులో నిందితుడు నకిలీ కరెన్సీని ఉద్దేశపూర్వక చెలామణి చేయడానికి ప్రయత్నించాడని నిర్ధారించింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ, ఇతర వస్తువులను జప్తు చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







