ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- September 17, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు అమెరికా పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మొదటగా, సెప్టెంబర్ 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో డెలావేర్లోని విల్మింగ్టన్లో జరగబోయే నాలుగో క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానులు పాల్గొంటారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు చర్చలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 22న న్యూయార్క్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ సంస్థల సీఈవోలతో సమావేశమై, భారత్లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో ఎడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈఓ వివేక్ లాల్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్, ఫస్ట్ సోలార్ సీఈఓ మార్క్ విడ్మార్, బ్లాక్స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎ ష్వార్జ్మెన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు.
సెప్టెంబర్ 23న న్యూయార్క్లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ పర్యటన ద్వారా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని, రెండు దేశాల మధ్య వ్యాపార, సాంకేతిక రంగాల్లో సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
--వేణు పెరుమాళ్ళ, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









