అల్ ముగ్సేల్ రోడ్ ప్రాజెక్ట్.. కుదిరిన OMR9 మిలియన్ల ఒప్పందం..!!
- September 19, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అల్ ముగ్సైల్ రోడ్ మరియు బ్రిడ్జ్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని మొత్తం వ్యయం OMR 9 మిలియన్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంపై రవాణా, కమ్యూనికేషన్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ సైద్ బిన్ హమూద్ అల్ మావాలి సంతకం చేయగా, AZ ఇంజనీర్స్ నుండి ఇంజనీర్ సయ్యద్ అజర్ కంపెనీ తరపున రవాణా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సమక్షంలో సంతకం చేశారు.
ఈ ప్రాజెక్ట్లో 630 మీటర్ల పొడవు గల కాంక్రీట్ వంతెన నిర్మాణం ఉంటుంది. దీనికి 20 అబ్ట్మెంట్లు ఒక్కొక్కటి 13 మీటర్ల ఎత్తు ఉంటుంది., రెండు అతిపెద్ద ఆర్చీలు 45.9 మీటర్లకు, మిగిలిన ఆర్చ్లు 35.9 మీటర్ల వరకు ఉంటాయి. వంతెన రెండు వైపులా పార్కింగ్ ప్రాంతాలు, పాదచారుల నడక మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సలాలా నుండి ధోఫర్ గవర్నరేట్ (రఖ్యౌట్ మరియు ధాల్కుట్) పశ్చిమ జిల్లాలకు ట్రాఫిక్ ను సులువు చేయనుంది. రిపబ్లిక్ ఆఫ్ యెమెన్తో సరిహద్దు దాటడానికి అంతర్జాతీయ మార్గంగా కీలక రోల్ పోషించనుంది. ముఖ్యంగా మర్నీఫ్ గుహ, ముగ్సైల్ ఫౌంటైన్లు, ముగ్సైల్ బీచ్ఫ్రంట్లకు సమీపంలో ఉన్న కారణంగా వంతెన ప్రదేశం పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









