41 దేశాల్లో యూఏఈ ఛారిటీ ఇఫ్తార్
- June 20, 2016
మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీ మరియు హుమానిటేరియన్ ఫౌండేషన్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలి, పేద ముస్లింల కోసం పలు దేశాల్లో చేపడుతోంది. అరబ్, అసియా, మరియు ఆఫ్రికా దేశాలతోపాటు, హైతి, అమెరికా, కెనడాల్లోనూ ఇఫ్తార్ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్యను 13.3 శాతం పెంచారు. 8 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో 43,637 మందికి ఈ లబ్దిని చేకూర్చతలపెట్టారు. వైఎస్ ఛైర్మన్ - బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఛాన్సెలర్ ఇబ్రహీమ్ బౌమెల్లా మాట్లాడుతూ, ఇస్లాం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, అలాగే పేదల్ని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పాలస్తీనా, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్, సుడాన్, మారిటానియా, సోమాలియా, దిజ్బౌతి తదితర ప్రాంతాల్లో ఇఫ్తార్ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది ఈ ఫౌండేషన్. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, తజకిస్తాన్, ఇండియా, జపాన్, థాయిలాండ్ తదితర ఆసియా దేశాల్లోనూ పలు ప్రాజెక్టుల్ని నిర్వహించింది. ఘనా, సెంగాయ్, ఇతియోపియా, ఉగాండా, కెన్యా తదితర 15 ఆఫ్రికా దేశాల్లోనూ ఇఫ్తార్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







