రాజస్థాన్ లో మెరుగైన అవకాశాలు..పెట్టుబడిదారులకు పిలుపు..!!
- September 21, 2024
దోహా: దోహా, ఇండియా మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని రాజస్థాన్ ప్రభుత్వ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి హెచ్ ఈ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ మీట్ సందర్భంగా తన ముఖ్య ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో మెరుగైన పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఖతార్లోని పౌరులు, నివాసితులను ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి హెచ్ఈ విపుల్, రాయబార కార్యాలయానికి చెందిన ఇతర ప్రతినిధులు, భారతీయ ప్రవాసులు, ఖతార్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. అగ్రి ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, గనులు, మినరల్స్, టెక్స్టైల్స్, ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం వంటి కొన్ని కీలక రంగాలు ఊహించిన వృద్ధిని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ 2026 నాటికి $535 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడిందని వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట









