రాజస్థాన్ లో మెరుగైన అవకాశాలు..పెట్టుబడిదారులకు పిలుపు..!!

- September 21, 2024 , by Maagulf
రాజస్థాన్ లో మెరుగైన అవకాశాలు..పెట్టుబడిదారులకు పిలుపు..!!

దోహా: దోహా, ఇండియా మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని రాజస్థాన్ ప్రభుత్వ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి హెచ్ ఈ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్ సందర్భంగా తన ముఖ్య ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో మెరుగైన పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఖతార్‌లోని పౌరులు,  నివాసితులను ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ విపుల్, రాయబార కార్యాలయానికి చెందిన ఇతర ప్రతినిధులు, భారతీయ ప్రవాసులు, ఖతార్ పెట్టుబడిదారులు పాల్గొన్నారు. అగ్రి ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, గనులు, మినరల్స్, టెక్స్‌టైల్స్, ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం వంటి కొన్ని కీలక రంగాలు ఊహించిన వృద్ధిని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ 2026 నాటికి $535 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడిందని వివరించారు.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com