9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- March 04, 2026
రియాద్: సౌదీ ఎయిర్ స్పేస్ సురక్షితంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే తొమ్మిది డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.సౌదీ అరేబియా తన భూభాగం, పౌరులు మరియు నివాసితులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు.
మరోవైపు, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులను ప్రపంచ దేశాలు వ్యతిరేకించడాన్ని సౌదీ అరేబియా క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఆయా దేశాల నేతలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









