బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!
- September 21, 2024
మనామా: జూలైలో బహ్రెయిన్ పెద్ద సంఖ్యలో విజిటర్స్ కు స్వాగతం పలికింది. దాదాపు 3.3 మిలియన్ల మంది వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ప్రయాణించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్వే, బహ్రెయిన్ ఓడరేవుల ద్వారా దేశంలోకి వచ్చివెళ్లినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది.ముఖ్యంగా బహ్రెయిన్ను సౌదీ అరేబియాకు కలిపే కింగ్ ఫహద్ కాజ్వే అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ ప్రదేశంగా పేర్కొన్నారు. జూలైలో 1,407,970 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,427,189 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్ను విడిచి వెళ్లారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 223,784 మంది ప్రయాణికులు బహ్రెయిన్కు చేరుకోగా, 247,564 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుండి వెళ్లారు. ఓడరేవుల ద్వారా 1,856 మంది ప్రయాణికులు బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,892 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుంచి బయలుదేరారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









