బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!
- September 21, 2024
మనామా: జూలైలో బహ్రెయిన్ పెద్ద సంఖ్యలో విజిటర్స్ కు స్వాగతం పలికింది. దాదాపు 3.3 మిలియన్ల మంది వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ప్రయాణించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్వే, బహ్రెయిన్ ఓడరేవుల ద్వారా దేశంలోకి వచ్చివెళ్లినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది.ముఖ్యంగా బహ్రెయిన్ను సౌదీ అరేబియాకు కలిపే కింగ్ ఫహద్ కాజ్వే అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ ప్రదేశంగా పేర్కొన్నారు. జూలైలో 1,407,970 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,427,189 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్ను విడిచి వెళ్లారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 223,784 మంది ప్రయాణికులు బహ్రెయిన్కు చేరుకోగా, 247,564 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుండి వెళ్లారు. ఓడరేవుల ద్వారా 1,856 మంది ప్రయాణికులు బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,892 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుంచి బయలుదేరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







