బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!
- September 21, 2024
మనామా: జూలైలో బహ్రెయిన్ పెద్ద సంఖ్యలో విజిటర్స్ కు స్వాగతం పలికింది. దాదాపు 3.3 మిలియన్ల మంది వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ప్రయాణించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్వే, బహ్రెయిన్ ఓడరేవుల ద్వారా దేశంలోకి వచ్చివెళ్లినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది.ముఖ్యంగా బహ్రెయిన్ను సౌదీ అరేబియాకు కలిపే కింగ్ ఫహద్ కాజ్వే అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ ప్రదేశంగా పేర్కొన్నారు. జూలైలో 1,407,970 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,427,189 మంది ప్రయాణికులు కాజ్వే ద్వారా బహ్రెయిన్ను విడిచి వెళ్లారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 223,784 మంది ప్రయాణికులు బహ్రెయిన్కు చేరుకోగా, 247,564 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుండి వెళ్లారు. ఓడరేవుల ద్వారా 1,856 మంది ప్రయాణికులు బహ్రెయిన్లోకి ప్రవేశించగా, 1,892 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుంచి బయలుదేరారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









