బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!

- September 21, 2024 , by Maagulf
బహ్రెయిన్ కు జూలైలో పోటెత్తిన విజిటర్స్.. 3 మిలియన్లకు పైగా రాక..!!

మనామా: జూలైలో బహ్రెయిన్ పెద్ద సంఖ్యలో విజిటర్స్ కు స్వాగతం పలికింది. దాదాపు 3.3 మిలియన్ల మంది వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ప్రయాణించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్‌వే, బహ్రెయిన్ ఓడరేవుల ద్వారా దేశంలోకి వచ్చివెళ్లినట్లు అధికారిక నివేదిక వెల్లడించింది.ముఖ్యంగా బహ్రెయిన్‌ను సౌదీ అరేబియాకు కలిపే కింగ్ ఫహద్ కాజ్‌వే అత్యంత రద్దీగా ఉండే ప్రవేశ ప్రదేశంగా పేర్కొన్నారు. జూలైలో 1,407,970 మంది ప్రయాణికులు కాజ్‌వే ద్వారా బహ్రెయిన్‌లోకి ప్రవేశించగా, 1,427,189 మంది ప్రయాణికులు కాజ్‌వే ద్వారా బహ్రెయిన్‌ను విడిచి వెళ్లారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 223,784 మంది ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకోగా,  247,564 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుండి వెళ్లారు. ఓడరేవుల ద్వారా 1,856 మంది ప్రయాణికులు బహ్రెయిన్‌లోకి ప్రవేశించగా, 1,892 మంది ప్రయాణికులు బహ్రెయిన్ నుంచి బయలుదేరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com