సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ!
- September 22, 2024
అమరావతి: చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు చర్చ జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు టీటీడీ ఆహ్వానం అందించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తితిదే ఈవో, అదనపు ఈవో ఆహ్వానాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసిన అధికారులు. సీఎంకు అర్చకులు, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







