పూరీ జగన్నాథ్ ఆలయంలో రహస్య గదుల శోధన
- September 22, 2024
ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక టీమ్ రహస్య గదులను శోధిస్తోంది. శ్రీ క్షేత్రం ఆలయ పరిసరాల్లో మూడురోజుల పాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరక్టర్ జనరల్ జాహ్న విజ్ శర్మ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం శోధన ప్రారంభించింది.
రత్న భాండాగారం పరిస్థితి, అందులోని రహస్య గదులపై టీమ్ శోధిస్తోంది. టెక్నికల్ టీమ్లో సీఎస్ఐఆర్, నేషనల్ జియో ఫిజికల్ రిసేరిచ్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు ఉన్నారు. లేజర్ స్కానింగ్, హైటెక్ గ్యాడ్జట్లతో రత్న భాండాగారాన్ని తనిఖీ చేస్తున్నారు.
రేపు సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయి. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు శ్రీ క్షేత్రానికి భక్తులు రావద్దని సూచించారు. కాగా, ఈ ఏడాది జులైలోపూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను దాదాపు 46 సంవత్సరాల విరామం తర్వాత తెరిచారు. ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









