'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
- September 22, 2024
హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు.అభిమానులు భారీగా హాజరు కావడం, అందరినీ లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానుల తాకిడికి హోటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు.
తారక్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. నోవోటెల్ వేదికగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అయితే నోవాటెల్ ఆడిటోరియమ్ కెపాసిటీని మించి అభిమానులు వేదికకు చేరుకోవడం, ఈవెంట్కు హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో తోపులాటతో నోవాలెట్ హోటల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న నోవోటెల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వహించడానికి కష్టంగా ఉందంటూ వెనక్కి తగ్గింది. తాము ఈవెంట్ చేయలేమని చివరి నిమిషంలో నోవోటెల్ యాజమాన్యం చేతులెత్తేసింది. హీరో తారక్ ఈవెంట్కు వచ్చి ఐదు, పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని ఈవెంట్ ఆర్గనైజర్స్ నోవాటెల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ ఉండడంతో హీరో వస్తే అసలు కంట్రోల్ చేయలేం అని హోటల్ సిబ్బంది నిర్మోహమాటంగా చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడానికి ఈవెంట్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







