హైదరాబాద్లో NIA అధికారుల సోదాల కలకలం..
- September 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్ సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. సుమారు 3 గంటలపాటు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల తర్వాత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగస్టులో ఢిల్లీలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు. కొంతకాలం సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో రిజ్వాన్ ఉన్నాడని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు.. ఆ అపార్ట్ మెంట్ లో తనిఖీలు చేశారు. రిజ్వాన్ ని వెంట పెట్టుకుని సోదాలు నిర్వహించారు.
ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ను ఎన్ఐఏ అధికారులు ఇవాళ హైదరాబాద్ తీసుకొచ్చారు. సైదాబాద్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో సుమారుగా 3 గంటలపాటు సోదాలు చేశారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఉన్న సమయంలో గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో రిజ్వాన్ ఉన్నట్లు పక్కా ఆధారాలను సేకరించారు. ఇవాళ ఉదయం అతడిని తీసుకొచ్చి అపార్ట్ మెంట్ లో తనిఖీలు చేశారు. ఢిల్లీలో రిజ్వాన్ ను అరెస్ట్ చేసిన అధికారులు.. ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో పాటు పుణె మ్యాడుల్ లో పని చేసినట్లు గుర్తించారు.
రిజ్వాన్ ని అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. దాని ఆధారంగా అతడు హైదరాబాద్ లో గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పక్కా ఎవిడెన్స్ సేకరించారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకొచి ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సమయంలో రిజ్వాన్ ఏయే కార్యకలాపాలు చేశాడు అనేది ఆరా తీశారు ఎన్ఐఏ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఎన్ఐఏ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
తాజా వార్తలు
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు









