కువైట్ లో AI కెమెరాలు..ట్రాఫిక్ ఉల్లంఘనల పై కొరడా..!!
- September 23, 2024
కువైట్: సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను రికార్డ్ చేయడానికి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పర్యవేక్షణ కెమెరాలను ఉపయోగించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు ఉల్లంఘనలను ఆటోమేటిక్ గా పర్యవేక్షించడంలో మంత్రిత్వ శాఖ కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సాంకేతికత ఉల్లంఘనలను ఖచ్చితంగా ప్రభావవంతంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. తద్వారా రహదారి వినియోగదారుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీటు బెల్టు పెట్టుకోవాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ వాడకుండా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!