కువైట్ క్రౌన్ ప్రిన్స్తో ప్రధాని మోదీ కీలక సమావేశం..!!
- September 23, 2024
కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్, షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా అల్-సబాతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం న్యూయార్క్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. "కువైట్ క్రౌన్ ప్రిన్స్, హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాతో చర్చలు చాలా సంతృప్తికరంగా జరిగాయి. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ వంటి మరిన్ని రంగాలలో భారత్-కువైట్ సంబంధాలను ఎలా బలోపేతం చేయాలో మేము చర్చించాము.’’ అని కువైట్ యువరాజుతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో సమావేశమయ్యారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశానికి భారతీయ ఎగుమతులు USD 2.10 బిలియన్లకు చేరుకోవడంతో కువైట్తో భారతదేశ వాణిజ్యం పెరుగుదలను నమోదు చేసింది.
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ క్వాడ్ సమ్మిట్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్









