యూఏఈలో స్పల్ప భూకంపం.. ప్రకంపనలు నమోదు..!!
- September 23, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీకి చెందిన నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్ల ప్రకారం.. యూఏఈలో ఆదివారం 1.2 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది. అల్ ఫుజైరాలోని దిబ్బాలోని అల్ రహీబ్ ప్రాంతంలో రాత్రి 10.27 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1న ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలే ఆగస్టు 18న దిబ్బ తీరానికి సమీపంలో కూడా 3.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. యూఏఈలో జూన్ 8న రాత్రి 11.01 గంటలకు మసాఫీలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం కూడా నమోదైంది. మే 29న యూఏఈ నివాసితులు ఒమన్ సముద్ర ప్రాంతంలో స్వల్ప భూకంపాన్ని అనుభవించారు. మే 29న రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆ తర్వాత మరో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







