యూఏఈలో స్పల్ప భూకంపం.. ప్రకంపనలు నమోదు..!!
- September 23, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీకి చెందిన నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్ల ప్రకారం.. యూఏఈలో ఆదివారం 1.2 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది. అల్ ఫుజైరాలోని దిబ్బాలోని అల్ రహీబ్ ప్రాంతంలో రాత్రి 10.27 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1న ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలే ఆగస్టు 18న దిబ్బ తీరానికి సమీపంలో కూడా 3.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. యూఏఈలో జూన్ 8న రాత్రి 11.01 గంటలకు మసాఫీలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం కూడా నమోదైంది. మే 29న యూఏఈ నివాసితులు ఒమన్ సముద్ర ప్రాంతంలో స్వల్ప భూకంపాన్ని అనుభవించారు. మే 29న రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆ తర్వాత మరో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!