యూఏఈలో స్పల్ప భూకంపం.. ప్రకంపనలు నమోదు..!!
- September 23, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీకి చెందిన నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్ల ప్రకారం.. యూఏఈలో ఆదివారం 1.2 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది. అల్ ఫుజైరాలోని దిబ్బాలోని అల్ రహీబ్ ప్రాంతంలో రాత్రి 10.27 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1న ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలే ఆగస్టు 18న దిబ్బ తీరానికి సమీపంలో కూడా 3.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. యూఏఈలో జూన్ 8న రాత్రి 11.01 గంటలకు మసాఫీలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం కూడా నమోదైంది. మే 29న యూఏఈ నివాసితులు ఒమన్ సముద్ర ప్రాంతంలో స్వల్ప భూకంపాన్ని అనుభవించారు. మే 29న రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆ తర్వాత మరో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!







