బీరుట్ కు విమానాలను నిలిపివేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- September 25, 2024
దోహా: ఇజ్రాయెల్ -హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బుధవారం వరకు బీరూట్కు విమానాలను నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. "లెబనాన్లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఖతార్ ఎయిర్వేస్ సెప్టెంబర్ 25 వరకు బీరుట్ రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాము." అని ఖతార్ జాతీయ క్యారియర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సోమవారం 35 మంది చిన్నారులు సహా కనీసం 492 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం ఖతార్ ఎయిర్వేస్ తన బీరుట్ విమానాలలో పేజర్లు మరియు వాకీ-టాకీలపై నిషేధాన్ని ప్రకటించింది. లేబనాన్ లో మ్యూనికేషన్స్ డివైజ్ పేలుళ్లలో 37 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. కాగా, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ , యునైటెడ్ స్టేట్స్కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ కూడా బీరూట్కు విమానాలను నిలిపివేసాయి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









