బీరుట్ కు విమానాలను నిలిపివేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- September 25, 2024
దోహా: ఇజ్రాయెల్ -హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బుధవారం వరకు బీరూట్కు విమానాలను నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. "లెబనాన్లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఖతార్ ఎయిర్వేస్ సెప్టెంబర్ 25 వరకు బీరుట్ రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాము." అని ఖతార్ జాతీయ క్యారియర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సోమవారం 35 మంది చిన్నారులు సహా కనీసం 492 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం ఖతార్ ఎయిర్వేస్ తన బీరుట్ విమానాలలో పేజర్లు మరియు వాకీ-టాకీలపై నిషేధాన్ని ప్రకటించింది. లేబనాన్ లో మ్యూనికేషన్స్ డివైజ్ పేలుళ్లలో 37 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. కాగా, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ , యునైటెడ్ స్టేట్స్కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ కూడా బీరూట్కు విమానాలను నిలిపివేసాయి.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









