బీరుట్ కు విమానాలను నిలిపివేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- September 25, 2024
దోహా: ఇజ్రాయెల్ -హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బుధవారం వరకు బీరూట్కు విమానాలను నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. "లెబనాన్లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఖతార్ ఎయిర్వేస్ సెప్టెంబర్ 25 వరకు బీరుట్ రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాము." అని ఖతార్ జాతీయ క్యారియర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సోమవారం 35 మంది చిన్నారులు సహా కనీసం 492 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం ఖతార్ ఎయిర్వేస్ తన బీరుట్ విమానాలలో పేజర్లు మరియు వాకీ-టాకీలపై నిషేధాన్ని ప్రకటించింది. లేబనాన్ లో మ్యూనికేషన్స్ డివైజ్ పేలుళ్లలో 37 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. కాగా, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ , యునైటెడ్ స్టేట్స్కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ కూడా బీరూట్కు విమానాలను నిలిపివేసాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







