ముహరఖ్లో 24-గంటల బిజినెస్..68% చట్టవిరుద్ధమే..!!
- September 25, 2024
మనామా: 68 సంస్థలు చట్టవిరుద్ధంగా 24 గంటలపాటు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ముహర్రాక్ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముహరక్ మున్సిపల్ కౌన్సిల్ సంస్థలు 24 గంటల ఆపరేషన్ లైసెన్సుల కోసం అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ముహరక్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో.. ముహరక్ పోలీస్ డైరెక్టరేట్, పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ, మునిసిపల్ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రతినిధులు లైసెన్స్ లేని సంస్థలు పెరగడంపై అసహనం వ్యక్తం చేశారు. 24 గంటలూ తెరిచే 81 షాపుల్లో కేవలం 26 మాత్రమే సరైన లైసెన్స్ను కలిగి ఉన్నాయని, 55 వ్యాపారాలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ముహర్రాక్ పోలీస్ డైరెక్టరేట్ డేటా తెలిపింది. ఈ నాన్-కాంప్లైంట్ ఆపరేషన్లలో రెస్టారెంట్లు, కన్వీనియన్స్ స్టోర్లు, కేఫ్లు, లాండ్రీ, వేప్ షాప్ ఉన్నాయని, ఇవి ప్రజా భద్రత మరియు నియంత్రణ సమ్మతికి ప్రమాదాన్ని కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసు డైరెక్టరేట్ మాత్రం 97 శాతం దరఖాస్తులను రౌండ్-ది-క్లాక్ ఆపరేషన్ కోసం ఆమోదించినట్టు తెలిపింది. అయితే, ఈ అధిక ఆమోదం రేటు లైసెన్సింగ్ నిబంధనలను అమలు చేయడం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ సమావేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాపారాల కోసం లైసెన్సింగ్ ప్రక్రియను సరళీకృతం చేయవలసిన అవసరం ఉందని కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అల్ నార్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









