ప్రైవేట్ హాస్పిటల్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు చెల్లింపు..!!
- September 26, 2024
మనామా: ఆగస్టులో పెండింగ్ జీతాల కోసం డిమాండ్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగులు తమ వేతనాలను అందుకున్నారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూలై, ఆగస్ట్ నెల జీతాలు చెల్లించినట్టు తెలిపింది. సెప్టెంబరు చివరిలో మిగిలిన చెల్లింపులు అవుతాయని పేర్కొంది. 50 మంది బహ్రెయిన్లతో సహా సుమారు 190 మంది సిబ్బందిని నియమించుకున్న ఆసుపత్రి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత ప్రధాన సేవలను తగ్గించింది. కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఆగస్టు చివరిలో ఆసుపత్రిని ఔట్ పేషెంట్ కేర్కు మార్చినప్పుడు సాధారణ శస్త్రచికిత్స, ప్రసూతి వంటి 30 ప్రత్యేక సేవలు ప్రభావితమయ్యాయి. బాధిత బహ్రెయిన్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కనుగొనే ప్రయత్నాలను కూడా చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికీ పని లేని వారు తొమ్మిది నెలల వరకు లేదా వారు కొత్త ఉపాధిని పొందే వరకు వారి బీమా చేసిన వేతనంలో 60 శాతం పరిహారం పొందుతారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!









