అల్ మక్తూమ్ బ్రిడ్జిపై రిపేర్లు.. తాత్కాలికంగా బస్ సర్వీసులు మళ్లింపు..!!
- October 01, 2024
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనపై నిర్వహణ కారణంగా దుబాయ్లోని కొన్ని బస్సు మార్గాలను తాత్కాలికంగా మళ్లించినట్టు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ మార్గాలు — 10, 23, 27, 33, 88, C04, C05, C10, C26, E16, X28, X94 — సెప్టెంబర్ 29 నుండి జనవరి 23, 2025 వరకు నిర్దిష్ట బస్ స్టాప్ల గుండా వెళ్లవని తెలిపారు. అల్ మక్తూమ్ వంతెన మీదుగా వెళ్లే బస్సులను తాత్కాలికంగా అల్ గర్హౌద్ వంతెన మీదుగా మళ్లిస్తారు. అల్ మక్తూమ్ వంతెన 2025 జనవరి 16 వరకు సెమీ-ఆపరేషనల్ వేళలను పాటిస్తుందని, ప్రధాన వంతెన సోమవారాలు నుండి శనివారాల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుందని, ఆదివారాల్లో 24 గంటల పాటు మూసివేయబడుతుందని అథారిటీ వెల్లడించింది. మళ్లింపు సమయంలో డ్నాటా 1, డ్నాటా 2, సిటీ సెంటర్ మెట్రో బస్ స్టాప్ 1-1, ఔద్ మేథా బస్ స్టేషన్ 7, ఉమ్ హురైర్ రోడ్ 2, రషీద్ హాస్పిటల్ రౌండ్అబౌట్ 1, రూట్ 23లో సర్వీస్ డెయిరా సిటీ సెంటర్ బస్ స్టేషన్లు అందుబాటులో ఉండవని తెలిపారు. తన S'hail యాప్ ద్వారా మార్పులను ఎప్పటికప్పుడు తెలసుకోవాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









