అల్ మక్తూమ్ బ్రిడ్జిపై రిపేర్లు.. తాత్కాలికంగా బస్ సర్వీసులు మళ్లింపు..!!
- October 01, 2024
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనపై నిర్వహణ కారణంగా దుబాయ్లోని కొన్ని బస్సు మార్గాలను తాత్కాలికంగా మళ్లించినట్టు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ మార్గాలు — 10, 23, 27, 33, 88, C04, C05, C10, C26, E16, X28, X94 — సెప్టెంబర్ 29 నుండి జనవరి 23, 2025 వరకు నిర్దిష్ట బస్ స్టాప్ల గుండా వెళ్లవని తెలిపారు. అల్ మక్తూమ్ వంతెన మీదుగా వెళ్లే బస్సులను తాత్కాలికంగా అల్ గర్హౌద్ వంతెన మీదుగా మళ్లిస్తారు. అల్ మక్తూమ్ వంతెన 2025 జనవరి 16 వరకు సెమీ-ఆపరేషనల్ వేళలను పాటిస్తుందని, ప్రధాన వంతెన సోమవారాలు నుండి శనివారాల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుందని, ఆదివారాల్లో 24 గంటల పాటు మూసివేయబడుతుందని అథారిటీ వెల్లడించింది. మళ్లింపు సమయంలో డ్నాటా 1, డ్నాటా 2, సిటీ సెంటర్ మెట్రో బస్ స్టాప్ 1-1, ఔద్ మేథా బస్ స్టేషన్ 7, ఉమ్ హురైర్ రోడ్ 2, రషీద్ హాస్పిటల్ రౌండ్అబౌట్ 1, రూట్ 23లో సర్వీస్ డెయిరా సిటీ సెంటర్ బస్ స్టేషన్లు అందుబాటులో ఉండవని తెలిపారు. తన S'hail యాప్ ద్వారా మార్పులను ఎప్పటికప్పుడు తెలసుకోవాలని అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







