డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్‌.. 12 మంది ముఠా అరెస్ట్..!!

- October 03, 2024 , by Maagulf
డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్‌.. 12 మంది ముఠా అరెస్ట్..!!

మనామా: బహ్రెయిన్ లో డిజిటల్ చెల్లింపు స్కామ్ లో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్యాంకింగ్ వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది మోసగాళ్లు ఆసియా జాతీయులని, వారిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సేకరించిన నిఘా డేటా ఆధారంగా యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com