విద్యతోనే తీవ్రవాదానికి చెక్.. శాంతి సాధనంలో కీలక భూమిక..HM రాజు
- October 03, 2024
మనామా: శాంతిని కాపాడేందుకు, అన్ని రకాల తీవ్రవాదాలను ఎదుర్కోవడానికి విద్య పాత్ర ఎంతో కీలకమని మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. శాంతిని సాధించడం, పొరుగు దేశాలతో బలమైన సంబంధాలను పెంపొందించడానికి బహ్రెయిన్ రాజ్యం అంకితభావాన్ని ఆయన పునరుద్ఘాటించారు. సఖిర్ ప్యాలెస్లో రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు, అధికారులు, పౌరులు, వివిధ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలుసుకున్న సందర్భంగా హెచ్ఎం రాజు ఈ మేరకు వ్యాఖ్యానించారు. మానవ, మతపరమైన విలువలను గౌరవించాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో జరుగుతున్న యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, ఉపాధి వంటి అవసరమైన సేవలను అందించడంపై దృష్టి పెట్టాలని హెచ్ఎం రాజు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







