ఒమన్లోని ఎంబసీలో ‘మహాత్మా గాంధీ 155వ జయంతి’ అహింసా దినోత్సవం..!!
- October 03, 2024
మస్కట్: రాజయోగ సెంటర్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్తో కలిసి మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఒమానీ ప్రముఖులు, భారతీయులు, రెండు దేశాల విద్యార్థులు, రెసిడెంట్ రాయబారులు, దౌత్య దళ సభ్యులు, ప్రవాస భారతీయులతో సహా అన్ని రంగాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ నుండి 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి సహనం గాంధేయ విలువలను యువతరం అర్థం చేసుకోవాలని వక్తలు సూచించారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఒమన్లో దీర్ఘకాల నివాసి అయిన మిస్టర్ కిరణ్ అషర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హెచ్.హెచ్.సయ్యదా హుజైజా అల్ సైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి హెచ్ఇ అమిత్ నారంగ్ తన స్వాగత ప్రసంగంలో భారతీయ సాంస్కృతిక వారసత్వం గురించి, గాంధీజీ అహింస విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







