ఒమన్లోని ఎంబసీలో ‘మహాత్మా గాంధీ 155వ జయంతి’ అహింసా దినోత్సవం..!!
- October 03, 2024
మస్కట్: రాజయోగ సెంటర్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్తో కలిసి మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఒమానీ ప్రముఖులు, భారతీయులు, రెండు దేశాల విద్యార్థులు, రెసిడెంట్ రాయబారులు, దౌత్య దళ సభ్యులు, ప్రవాస భారతీయులతో సహా అన్ని రంగాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ నుండి 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి సహనం గాంధేయ విలువలను యువతరం అర్థం చేసుకోవాలని వక్తలు సూచించారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఒమన్లో దీర్ఘకాల నివాసి అయిన మిస్టర్ కిరణ్ అషర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హెచ్.హెచ్.సయ్యదా హుజైజా అల్ సైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి హెచ్ఇ అమిత్ నారంగ్ తన స్వాగత ప్రసంగంలో భారతీయ సాంస్కృతిక వారసత్వం గురించి, గాంధీజీ అహింస విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









