ఒమన్లోని ఎంబసీలో ‘మహాత్మా గాంధీ 155వ జయంతి’ అహింసా దినోత్సవం..!!
- October 03, 2024
మస్కట్: రాజయోగ సెంటర్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్తో కలిసి మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఒమానీ ప్రముఖులు, భారతీయులు, రెండు దేశాల విద్యార్థులు, రెసిడెంట్ రాయబారులు, దౌత్య దళ సభ్యులు, ప్రవాస భారతీయులతో సహా అన్ని రంగాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ నుండి 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి సహనం గాంధేయ విలువలను యువతరం అర్థం చేసుకోవాలని వక్తలు సూచించారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఒమన్లో దీర్ఘకాల నివాసి అయిన మిస్టర్ కిరణ్ అషర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హెచ్.హెచ్.సయ్యదా హుజైజా అల్ సైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒమన్ సుల్తానేట్లో భారత రాయబారి హెచ్ఇ అమిత్ నారంగ్ తన స్వాగత ప్రసంగంలో భారతీయ సాంస్కృతిక వారసత్వం గురించి, గాంధీజీ అహింస విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







