నస్రల్లా వారసుడి లక్ష్యంగా బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి..
- October 04, 2024
లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.హెజ్ బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హసీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడిని ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. హషీమ్ ప్రస్తుతం హెజ్ బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నాడు. హసన్ నస్రల్లాకు అతను దగ్గరి బంధువు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో.. ఇవాళ ఉదయం బీరుట్ లోని విమానాశ్రయం వద్ద విమానం ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బీరుట్ విమానాశ్రయంలో దిగిన విమానం (మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ ఎంఈ 429) దుబాయ్ నుంచి వచ్చింది. విమానాశ్రయానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న సిన్ఎల్ఫిల్ నుంచి ఈ మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. విమానాశ్రయంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నిర్ధారణకాలేదు.
ఇజ్రాయెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి ఓ టెలివిజన్లో మాట్లాడుతూ.. లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకోని తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు. టెర్రరిస్ట్ గ్రూపులను వాటి స్థావరాలను తిరిగి స్థాపించుకునే అవకాశం ఇవ్వకుండా తమ దాడులు ఉంటాయని తెలిపాడు. భవిష్యత్తులో హెజ్ బొల్లాను ఈ ప్రదేశాలలో స్థాపించడానికి మేము అనుమతివ్వము. హెజ్ బొల్లా కు వ్యతిరేకంగా తీవ్రమైన దాడులు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయని చెప్పారు.
ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. హెజ్ బొల్లా సీనియర్ నాయకుల సమావేశం జరిగిన బంకర్ పై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో హెజ్బొల్లా కొత్త అధిపతి, హసన్ నస్రల్లా సోదరుడు హషీమ్ సఫీద్దీన్ మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ కాలేదు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







