పాక్ చేతిలో శ్రీలంక చిత్తు..
- October 04, 2024
షార్జా: మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. గ్రూప్-ఎలో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.
పాక్ తరఫున కెప్టెన్ ఫాతిమా సనా (30; 20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగగా.. నిద దార్ (23), ఒమైమా సోహైల్ (18) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో చమరీ ఆటపట్టు, సుగంధిక కుమారి, ఉదేశిక ప్రబోధని చెరో 3 వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంకకు బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం శ్రీలంక బ్యాటర్లు ఛేదించలేక పోయారు. పాక్ బౌలర్ల ధాటికి లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులే చేయగలిగింది. నిలాక్షిక సిల్వ (22), విశ్మి గుణరత్నే (20) ఇద్దరే రెండంకెళ్ల స్కోరును దాటగలిగారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్ 3 వికెట్లతో విజృంభించగా.. ఫాతిమా, ఒమైమా, నష్ర సంధూ తలో 2 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు ప్రపంచకప్లో శుభారంభాన్ని అందించారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









