యుద్ధం కోరుకోం.. కానీ ప్రతిఘటిస్తాం: ఇరాన్
- October 04, 2024
ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్ ఖతార్ వెళ్లారు. అక్కడ ద్వైపాక్షిక చర్చలతోపాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు. వారంపాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని, అమెరికా, ఐరోపా దేశాలు కోరాయన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని, అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయం కరంగా ప్రతి దాడి చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్









