యుద్ధం కోరుకోం.. కానీ ప్రతిఘటిస్తాం: ఇరాన్
- October 04, 2024
ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్ ఖతార్ వెళ్లారు. అక్కడ ద్వైపాక్షిక చర్చలతోపాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు. వారంపాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని, అమెరికా, ఐరోపా దేశాలు కోరాయన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని, అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయం కరంగా ప్రతి దాడి చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









