ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!
- October 04, 2024
దుబాయ్: సుమారు 75,000 మందికి నివాస, వ్యాపార సౌకర్యాలతో ఎక్స్పో సిటీ దుబాయ్ కోసం కొత్త మాస్టర్ ప్లాన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం ఆమోదించారు. 'ఎక్స్పో 2020 దుబాయ్' మరియు UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (COP28)కి ఆతిథ్యం ఇచ్చిన నగరాన్ని దుబాయ్ భవిష్యత్తు వృద్ధికి ప్రధాన నగరంగా మార్చడం ఈ ప్రణాళిక లక్ష్యమని పేర్కొన్నారు. ఐదు జిల్లాల్లో 3.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎక్స్పో సిటీ దుబాయ్లో 35వేల కంటే ఎక్కువ మంది నివాసితులు , 40వేల మంది ఉద్యోగులు ఏకకాలంలో పనిచేసే సామర్థ్యం ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో యూఏఈ ప్రధాన సంస్థలలో ఒకటైన DP వరల్డ్ కోసం కొత్త గ్లోబల్ హెడ్క్వార్టర్స్, Dh10 బిలియన్ల విలువైన కొత్త అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఉన్నాయి. “ఈ రోజు మేము 'భవిష్యత్తును సృష్టించే' లక్ష్యంతో ఉన్న ఎక్స్పో సిటీ దుబాయ్ కోసం కొత్త ప్రణాళికను ఆమోదించాము. కొత్త మాస్టర్ ప్లాన్ ఎక్స్పో సిటీ దుబాయ్ని పెట్టుబడిదారులకు కేంద్రంగా, ఆవిష్కర్తలు, నివాసితులు మరియు సందర్శకుల కోసం శక్తివంతమైన, పెంపొందించే కమ్యూనిటీని ఏర్పాటు చేస్తుంది.’’ అని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









