రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- October 04, 2024
హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ మ్యాచ్కు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్ దసరా పండుగ రోజున (అక్టోబర్ 12) జరగనుండగా….. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయంపై హెచ్సీఏ తాజా అప్డేట్ వచ్చింది.
రేపటి (అక్టోబర్ 5) నుంచి ఈ మ్యాచ్ టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయిస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటిఎం యాప్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం ఆఫ్లైన్లో టిక్కెట్లు అమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు.
టిక్కెట్ల ధర రూ.750 నుంచి రూ.15 వేల వరకు ఉందన్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జింఖానా గ్రౌండ్స్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రింటవుట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









