మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- October 05, 2024
దుబాయ్: మెట్రో, ట్రామ్లో ప్రయాణికులు ఇప్పుడు ఇ-స్కూటర్లను తీసుకెళ్లవచ్చని దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇకపై సీటు లేకుండా ఫోల్డబుల్ ఇ-స్కూటర్లను మెట్రో, ట్రామ్లోని అన్ని కార్యాచరణ సమయాల్లో తీసుకెళ్లవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం మార్చి 1 నుండి మెట్రో, ట్రామ్ లోపల ఇ-స్కూటర్లపై ఫిబ్రవరి 29న ఆర్టీఏ నిషేధం విధించింది. అయితే, అవి తప్పనిసరిగా 120cm x 70cm x 40cm పరిమాణం స్పెసిఫికేషన్కు సరిపోవాలి. 20kg కంటే ఎక్కువ బరువు ఉండకూడదన్న షరతులు విధించింది. మరికొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో ఇ-స్కూటర్ ఛార్జింగ్ పెట్టవద్దు.
-తలుపులు, సీట్ల వద్ద అడ్డంగా పెట్టవద్దు.
-దుబాయ్ మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలోకి తడి లేదా మురికి ఇ-స్కూటర్లు అనుమతించబడవు.
-స్టేషన్లు లేదా ఫుట్బ్రిడ్జ్లలో ఇ-స్కూటర్ను నడపడం నిషేధం.
-స్టేషన్లు, ప్లాట్ఫారమ్లు లేదా రైళ్లు/ట్రామ్లలోకి ప్రవేశించేటప్పుడు ఇ-స్కూటర్లను తప్పనిసరిగా మడతపెట్టాలి.
-మెట్రో లేదా ట్రామ్ ప్రాంగణంలో అన్ని సమయాల్లో ఇ-స్కూటర్ పవర్ను ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







