ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- October 05, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో ట్రాఫిక్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. వివిధ చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన 51 మందిని అరెస్టు చేశారు. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్యాంపెయిన్ జరిగింది. మహిళా పోలీసు అధికారులతో సహా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ మద్దతుతో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్కు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు.
క్యాంపెయిన్ సందర్భంగా 2,831 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశారు. 34 మంది వ్యక్తులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. రెసిడెన్సీ వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 17 మందిని అదుపులోకి తీసుకోగా.. 22 వాంటెడ్ వాహనాలను సీజ్ చేశారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









