ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- October 05, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో ట్రాఫిక్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. వివిధ చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన 51 మందిని అరెస్టు చేశారు. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్యాంపెయిన్ జరిగింది. మహిళా పోలీసు అధికారులతో సహా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ మద్దతుతో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్కు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు.
క్యాంపెయిన్ సందర్భంగా 2,831 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశారు. 34 మంది వ్యక్తులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. రెసిడెన్సీ వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 17 మందిని అదుపులోకి తీసుకోగా.. 22 వాంటెడ్ వాహనాలను సీజ్ చేశారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి