ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- October 05, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో ట్రాఫిక్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. వివిధ చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన 51 మందిని అరెస్టు చేశారు. మొదటి ఉప ప్రధాని, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ క్యాంపెయిన్ జరిగింది. మహిళా పోలీసు అధికారులతో సహా స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ మద్దతుతో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్కు చెందిన అధికారులు ఇందులో పాల్గొన్నారు.
క్యాంపెయిన్ సందర్భంగా 2,831 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశారు. 34 మంది వ్యక్తులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. రెసిడెన్సీ వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 17 మందిని అదుపులోకి తీసుకోగా.. 22 వాంటెడ్ వాహనాలను సీజ్ చేశారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







