ప్రైవేట్ టీచర్లకు గోల్డెన్ వీసా.. ప్రకటించిన దుబాయ్..!!
- October 06, 2024
యూఏఈ: దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసాలు ఇవ్వనున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా షేక్ హమ్దాన్ Xలో ఈ మేరకు తెలిపారు. దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసా మంజూరు చేయాలని తాము ఆదేశాలు జారీ చేసామన్నారు. యువకులను తీర్చిదిద్దడంతో టీచర్ల పాత్ర విలువ కట్టలేనిదన్నారు. అకడమిక్ ఎక్సలెన్స్, విద్య నాణ్యతను మెరుగుపరచడంలో అందించిన సహకారం, విద్యార్థులు మెరుగైన విద్యా ఫలితాలు, గుర్తింపు పొందిన గ్రాడ్యుయేషన్ అర్హతలను సాధించడంలో టీచర్ల ప్రయత్నాలపై ఆధారపడి వారికి గోల్డెన్ వీసాను మంజూరు చేయనున్నారు. దుబాయ్ ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎమిరేట్కు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని, భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడేలా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్.. దేశంలోని విద్యావేత్తలు అందిస్తున్న కృషిని ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 28ని ఎమిరాటీ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని షేక్ మొహమ్మద్ గతంలో ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









