ప్రైవేట్ టీచర్లకు గోల్డెన్ వీసా.. ప్రకటించిన దుబాయ్..!!
- October 06, 2024
యూఏఈ: దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసాలు ఇవ్వనున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా షేక్ హమ్దాన్ Xలో ఈ మేరకు తెలిపారు. దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసా మంజూరు చేయాలని తాము ఆదేశాలు జారీ చేసామన్నారు. యువకులను తీర్చిదిద్దడంతో టీచర్ల పాత్ర విలువ కట్టలేనిదన్నారు. అకడమిక్ ఎక్సలెన్స్, విద్య నాణ్యతను మెరుగుపరచడంలో అందించిన సహకారం, విద్యార్థులు మెరుగైన విద్యా ఫలితాలు, గుర్తింపు పొందిన గ్రాడ్యుయేషన్ అర్హతలను సాధించడంలో టీచర్ల ప్రయత్నాలపై ఆధారపడి వారికి గోల్డెన్ వీసాను మంజూరు చేయనున్నారు. దుబాయ్ ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎమిరేట్కు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని, భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడేలా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్.. దేశంలోని విద్యావేత్తలు అందిస్తున్న కృషిని ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 28ని ఎమిరాటీ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని షేక్ మొహమ్మద్ గతంలో ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి