ఐఎన్ఎస్ వీరలో రిసెప్షన్..హాజరైన భారత రాయబారి, ప్రముఖులు..!!
- October 10, 2024
మస్కట్: ఒమన్లోని భారత రాయబారి, హిస్ ఎక్సెలెన్సీ అమిత్ నారంగ్, భారత సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వి. శ్రీనివాస్తో కలిసి ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) తిర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ICGS) వీరలో రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. పోర్ట్ సుల్తాన్ ఖబూస్లో జరిగిన ట్విన్ డెక్ ఈవెంట్కు దౌత్యవేత్తలు, ఒమానీ ప్రముఖులు, అతిథులు హాజరయ్యారు. మస్కట్లో 3 రోజుల పోర్ట్ కాల్ చేసిన 1వ శిక్షణా స్క్వాడ్రన్లో భాగమైన భారతీయ నావికాదళ నౌకలు తిర్, శార్దూల్, ICGS వీర రాక సందర్భంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్తో ఉమ్మడి వ్యాయామాలు, శిక్షణా సెషన్లు, ప్రొఫెషనల్ ఎక్స్ఛేంజ్లు నిర్వహించారు. రెండు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని పలువురు పేర్కొన్నారు. ఒమన్ పర్యటన సందర్భంగా. వైస్ అడ్మిరల్ V. శ్రీనివాస్ ఒమన్ రాయల్ నేవీ కమాండర్ మరియు సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా ఒమన్ సైనిక అధికారులతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









