ఐఎన్ఎస్ వీరలో రిసెప్షన్..హాజరైన భారత రాయబారి, ప్రముఖులు..!!
- October 10, 2024
మస్కట్: ఒమన్లోని భారత రాయబారి, హిస్ ఎక్సెలెన్సీ అమిత్ నారంగ్, భారత సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వి. శ్రీనివాస్తో కలిసి ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) తిర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ICGS) వీరలో రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. పోర్ట్ సుల్తాన్ ఖబూస్లో జరిగిన ట్విన్ డెక్ ఈవెంట్కు దౌత్యవేత్తలు, ఒమానీ ప్రముఖులు, అతిథులు హాజరయ్యారు. మస్కట్లో 3 రోజుల పోర్ట్ కాల్ చేసిన 1వ శిక్షణా స్క్వాడ్రన్లో భాగమైన భారతీయ నావికాదళ నౌకలు తిర్, శార్దూల్, ICGS వీర రాక సందర్భంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రాయల్ నేవీ ఆఫ్ ఒమన్తో ఉమ్మడి వ్యాయామాలు, శిక్షణా సెషన్లు, ప్రొఫెషనల్ ఎక్స్ఛేంజ్లు నిర్వహించారు. రెండు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని పలువురు పేర్కొన్నారు. ఒమన్ పర్యటన సందర్భంగా. వైస్ అడ్మిరల్ V. శ్రీనివాస్ ఒమన్ రాయల్ నేవీ కమాండర్ మరియు సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా ఒమన్ సైనిక అధికారులతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









