కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం: ఆతిశీ
- October 11, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ బిజెపి నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం” అని ఆమె బిజెపి నేతలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, బీజేపీ ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు అధికారిక నివాసాలను దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆతిశీ, ఆప్ నేతలు కార్లు, బంగ్లాల కోసం రాజకీయాలు చేయరని, అవసరమైతే వీధుల్లో నుంచే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె బిజెపి నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆప్ పార్టీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, ఓట్ల కోసం బీజేపీ చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని ఆతిశీ తెలిపారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









