కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం: ఆతిశీ
- October 11, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ బిజెపి నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం” అని ఆమె బిజెపి నేతలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, బీజేపీ ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు అధికారిక నివాసాలను దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆతిశీ, ఆప్ నేతలు కార్లు, బంగ్లాల కోసం రాజకీయాలు చేయరని, అవసరమైతే వీధుల్లో నుంచే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె బిజెపి నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆప్ పార్టీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, ఓట్ల కోసం బీజేపీ చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని ఆతిశీ తెలిపారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







