కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం: ఆతిశీ
- October 11, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ నేతలు ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ బిజెపి నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “కార్లు, బంగ్లాల కోసం మేం పాలిటిక్స్ చేయం” అని ఆమె బిజెపి నేతలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆతిశీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, బీజేపీ ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు అధికారిక నివాసాలను దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, ఆతిశీ, ఆప్ నేతలు కార్లు, బంగ్లాల కోసం రాజకీయాలు చేయరని, అవసరమైతే వీధుల్లో నుంచే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె బిజెపి నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆప్ పార్టీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, ఓట్ల కోసం బీజేపీ చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని ఆతిశీ తెలిపారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







