రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు షాయాజీ షిండే
- October 11, 2024
ముంబై: ప్రముఖ నటుడు షియాజీ షిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.ఆయన మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరారు.ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది.ఎన్సీపీ చీఫ్ మరియు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈయన ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను జన్మతః మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.
షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ తరువాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసిన షిండే ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగా అలవాటు చేసుకుని దేహధారుడ్యాన్ని పెంపొందించుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారు.
షిండే రాజకీయాల్లోకి రావడం వెనుక ప్రధాన కారణం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. ఆయన రాజకీయాల్లోకి రావడం ద్వారా మహారాష్ట్రలోని ప్రజలకు మరింత సేవ చేయగలరని ఆశిస్తున్నట్లు అజిత్ పవా ర్ తెలిపారు. మహారాష్ట్రలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షాయాజీ షిండే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్త షాయాజీ షిండే అభిమానులో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో గొప్పగా రాణించిన షాయాజీ షిండే రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతారో చూడాలి.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









