యూఏఈలో పెరుగుతున్న వెన్ను నొప్పి బాధితులు? నిపుణులు ఏమంటున్నారంటే?
- October 12, 2024
యూఏఈ: యూఏఈలో వెన్నునొప్పి, కీళ్ల సమస్యల బాధితులు పెరుగుతున్నారు. దాంతో వారు ఈ సమస్యలతో వారు కార్యాలయాలకు గైర్హాజరుకు ప్రధాన కారణమని యూఏఈలోని వైద్య నిపుణులు తెలిపారు. అరబ్ హెల్త్లో ఇటీవల చర్చించిన ఒక అధ్యయనం ప్రకారం.. యూఏఈ జనాభాలో 60 శాతం మంది వెన్నునొప్పిని అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. "కార్యాలయంలో సరికాని ఎర్గోనామిక్స్ వెన్నునొప్పి పెరుగుతున్న కేసుల వెనుక వర్క్స్టేషన్లు, కుర్చీలు, పరికరాలు శరీరానికి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇది వెన్నెముక, వెనుక కండరాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాలక్రమేణా నొప్పి గాయాలకు కారణమవుతుంది. ”అని మెడ్కేర్ ఆర్థోపెడిక్స్ & స్పైన్ హాస్పిటల్లోని కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సమేహ్ అబోల్ఫోటౌహ్ తెలిపారు. ఆధునిక, డెస్క్-బౌండ్ జీవనశైలి, స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడపడం లేదా కార్లలో ప్రయాణించడం, కోర్ మరియు వెనుక కండరాలను బలహీనపరుస్తుందని, వెన్నెముకను మరింత ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. క్రమమైన వ్యాయామం లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందన్నారు. చికిత్స చేయకుండా వదిలేస్తే, వెన్నునొప్పి ఇతర MSDలు వ్యక్తి ఆరోగ్యం వృత్తిపై దీర్ఘకాలిక పరిణామాలను చూపుతాయని డాక్టర్ అబోల్ఫోటౌహ్ తెలిపారు. దీర్ఘకాలిక నొప్పి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, నిరంతర అసౌకర్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందని, ఇది వారి ఉత్పాదకత జీవన నాణ్యతను మరింత తగ్గిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







