ఒమన్ లో 7.8% పెరిగిన 3-5 స్టార్ హోటల్ ఆదాయం..!!
- October 13, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో 3-5 స్టార్ హోటళ్ల ఆదాయం ఆగస్టు 2023 చివరి నాటికి OMR138.650 మిలియన్లతో పోలిస్తే 2024 ఆగస్టు చివరి నాటికి 7.8 శాతం పెరిగి OMR149.446 మిలియన్లకు చేరుకుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన నివేదిక తెలిపింది. అదే విధంగా హోటల్ విజిటర్స్ సంఖ్యలో 8.4 శాతం పెరుగుదల నమోదైంది. గత ఆగస్టు చివరి నాటికి దాదాపు 1,400,735 మంది అతిథులు రాగా, ఆగస్టు 2023 చివరి నాటికి 1,292,509 మంది అతిథులు వచ్చారు. ఆక్యుపెన్సీ రేటు 2.3 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది.
ఒమానీ అతిథుల సంఖ్య 7.5 శాతం పెరిగి 541,035 మంది అతిథులకు చేరుకోగా, గల్ఫ్ అతిథుల సంఖ్య 0.6 శాతం పెరిగి 140,394 మంది అతిథులకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర అరబ్ అతిథుల సంఖ్య 13.8 శాతం పెరుగుదలతో 69,087కి చేరుకుంది. అయితే యూరోపియన్ అతిథుల సంఖ్య 16.5 శాతం పెరిగి 322,632కి చేరుకుంది. అమెరికా నుండి వచ్చిన అతిథుల సంఖ్య 38,190 మంది అతిథులు(3.2 శాతం పెరుగుదల)రాగా, ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన అతిథుల సంఖ్య 3 శాతం పెరుగుదలతో 7,569 మంది అతిథులకు చేరుకుంది. ఇక ఆసియా అతిథుల సంఖ్య 8.3 శాతం పెరిగి 203,932 అతిథులకు చేరుకుందని, అయితే ఓషియానియా నుండి వచ్చిన అతిథుల సంఖ్య 27.2 శాతం తగ్గి 19,758కి చేరుకుందని నివేదిక స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









