అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి
- October 16, 2024
అమెరికా: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మన తెలుగువాళ్లు మృతి చెందారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు. తీవ్రంగా గాయపడిన హరిత భర్త సాయి చెన్ను.. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి