అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువాళ్లు మృతి
- October 16, 2024
అమెరికా: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మన తెలుగువాళ్లు మృతి చెందారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
దక్షిణ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతులు తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు. తీవ్రంగా గాయపడిన హరిత భర్త సాయి చెన్ను.. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







