ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
- October 19, 2024
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) భవనానికి పూజలు చేశారు. ఆ తర్వాత భవనంలో కలియ తిరిగారు. అక్కడి అధికారులను రాజధాని నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ఉన్నారు.
CRDA ఆఫీసు పనుల ద్వారా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనట్లైంది. ఇక ఈరోజు నుంచి రాజధాని నిర్మాణం సాగుతుంది. CRDA భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ నిధులు కేటాయించారు. ఏడు అంతస్థుల ఈ భవనంలో ఇదివరకు రాజధాని పనులు సాగేవి. 2017 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ భవనంలో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇందులో కొన్ని మరమ్మతుల వంటివి చేపట్టాల్సి ఉంది. అలాగే సరికొత్త మార్పులు చెయ్యాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు మొదలవుతాయి.
సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. సీఆర్డీయే, ఏడీసీ, మున్సిపల్ శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టేలా ప్లాన్ ఉంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక