ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
- October 19, 2024
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) భవనానికి పూజలు చేశారు. ఆ తర్వాత భవనంలో కలియ తిరిగారు. అక్కడి అధికారులను రాజధాని నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారాయణ కూడా చంద్రబాబుతో ఉన్నారు.
CRDA ఆఫీసు పనుల ద్వారా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైనట్లైంది. ఇక ఈరోజు నుంచి రాజధాని నిర్మాణం సాగుతుంది. CRDA భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ నిధులు కేటాయించారు. ఏడు అంతస్థుల ఈ భవనంలో ఇదివరకు రాజధాని పనులు సాగేవి. 2017 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఐతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ భవనంలో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇందులో కొన్ని మరమ్మతుల వంటివి చేపట్టాల్సి ఉంది. అలాగే సరికొత్త మార్పులు చెయ్యాల్సి ఉంది. అవి పూర్తయ్యాక.. రాజధానిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు మొదలవుతాయి.
సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు కేటాయించారు. సీఆర్డీయే, ఏడీసీ, మున్సిపల్ శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం చేపట్టేలా ప్లాన్ ఉంది. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









