సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత..
- October 19, 2024
హైదరాబాద్: సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా 2024, అక్టోబర్ 19న హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ క్రమంలో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని హిందు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. టెంపుల్ వెనకాల ఏరియాలో ఓ మసీదు వైపు చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నం చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగాద్వం చోటు చేసుకుంది. ఘటన స్థలంలో పరిస్థితి అదుపు తప్పడంతో నిరసకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయగా.. తీవ్ర ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు, చెప్పులు రువ్వారు. ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం నిరసనకారులతో అట్టుడుకుతుండటంతో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. సికింద్రాబాద్ లోని పలు మార్కెట్లో దుకాణాలు.. హోటళ్ల తోపాటు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా మహంకాళి టెంపుల్ నుండి వేల సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. హిందూ ప్రజలు స్వచ్ఛందంగా షాప్స్ బంద్ పెట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లోని అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి విగ్రహ ధ్వంసం చేయడంతో అట్టుడికిన హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయాలకు అతీతంగా హిందువులు నిరసన ర్యాలీలో పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తూ
హోరెత్తించారు.
హిందు సంఘాల ర్యాలీతో సికింద్రాబాద్ రాష్ట్రపతి(RP) రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆర్పీ రోడ్డు బాటా చౌరస్తా మధ్యలో కూర్చొని నిరసన తెలుపుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను కాలి చేయించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. హిందూ సంఘాల నిరసనకారులు మహంకాళి టెంపుల్ నుండి మోండా మార్కెట్ మీదుగా కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్లు.. హిందూ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







