యూఏఈ వీసా అమ్నెస్టీ స్కీమ్..10వేల మందికి భారత కాన్సులేట్ సహాయం..!!

- October 23, 2024 , by Maagulf
యూఏఈ వీసా అమ్నెస్టీ స్కీమ్..10వేల మందికి భారత కాన్సులేట్ సహాయం..!!

దుబాయ్: యూఏఈ ప్రకటించిన క్షమాభిక్ష పథకం కోసం భారతీయ ఎంబసీలు అండగా నిలిచాయి. దాదాపు 10 వేలమంది భారతీయులకు సహాయం అందించినట్టు దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు అల్ అవీర్‌లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రయోజనాలను పొందడంలో భారతీయ పౌరులకు సహాయం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు వివిధ భారతీయ డయాస్పోరా సంస్థల సహకారంతో 10వేల కంటే ఎక్కువ మందికి సౌకర్యాలు కల్పించామని, అదే సమయంలో 1300 పాస్‌పోర్ట్‌లు, 1700 ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌లు, 1500 కంటే ఎక్కువ ఎగ్జిట్ పర్మిట్‌లను జారీ చేశామని వెల్లడించింది. యూఏఈ అధికారుల నుండి రుసుము/పెనాల్టీ మినహాయింపులను పొందడంలో సహాయంగా నిలిచినట్టు తెలిపింది. దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లోని భారతీయ పౌరులు తమ రెసిడెన్సీని చట్టబద్ధం చేసుకోవడానికి లేదా దేశం విడిచిపెట్టడానికి వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కాన్సులేట్ కోరింది. యూఏఈకి వచ్చే భారతీయులు ఎంట్రీ, వర్క్, రెసిడెన్సీ కోసం స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన సరైన విధానాలను అనుసరించాలని కూడా కాన్సులేట్ సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com