కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం
- October 23, 2024
విజయవాడ: కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎన్నికయింది. అసోసియేషన్ ఎన్నిక ప్రక్రియ ప్రకారం గత నెల నుండి నూతన కార్యవర్గం కోసం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించారు. వివిధ దశల్లో నామినేషన్లను పరిశీలించి కేడీసీఏ మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలోని ప్రతి పోస్ట్ కి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో వీరి ఎంపిక ఏకగ్రీవమయింది.
ఈ నేపథ్యంలో కేడీసీఏ ఎన్నికల అధికారి డాక్టర్ ఏ వెంకటరత్నం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఎంపీ కేశినేని శివనాద్ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గం…
కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పొట్లూరు శ్రీనివాస్ చౌదరి ఎంపిక కాగా, ఉపాధ్యక్షుడిగా బండారు శ్రీనివాసరావు, కార్యదర్శిగా మేడసాని రవీంద్ర చౌదరి ఎన్నికయ్యారు, అలాగే జాయింట్ సెక్రెటరీగా వి రజనీకాంత్ ఎన్నిక కాగా ట్రెజరర్ గా మొహమ్మద్ సాదిక్, కౌన్సిలర్ గా పి బాజీ షరీఫ్ ఖాన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







