గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియాకు రూ.6 కోట్ల 45 లక్షల విడుదల
- October 23, 2024
◉ 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా
హైదరాబాద్: తెలంగాణ ముఖమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం ఈనెల 21న రూ.6 కోట్ల 45 లక్షలను15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల విడుదలకు సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు రూ.1 కోటి 75 లక్షలు, జగిత్యాలకు రూ.1 కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు రూ.60 లక్షలు, నిర్మల్ కు రూ.50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారని వారు తెలిపారు.
2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో 160 మంది తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా.గల్ఫ్ మృతుల సంఖ్యను బట్టి అన్ని జిల్లాలకు తగిన నిధులు విడుదల చేస్తారని ఇందుకోసం మొత్తంగా రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించారని వినోద్ కుమార్, భీంరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









