దుబాయ్ మెట్రో ఛాలెంజ్..Dh10,000 నగదు బహుమతి, 50gm బంగారం గెలుచుకోండి..!!
- October 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నవంబర్ 1న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని జరుపుకుంటున్నది. దుబాయ్లో వివిధ ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించే ప్రయాణికులు 1 మిలియన్ Nol+ పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు 'మిస్టిరియస్ మ్యాన్ ఛాలెంజ్' విజేతలకు విలువైన నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. అదృష్ట విజేతకు Dh10,000 నగదు బహుమతితో పాటు 50 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అక్టోబర్ 28 నుండి ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని RTA అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రజా రవాణా దినోత్సవాన్ని ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. RTA ఆరు కేటగిరీలలో ప్రజా రవాణా వినియోగదారులకు బహుమతులు అందజేస్తుంది.ప్రతి వర్గం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది.ప్రతి ఒక్కరికి 'పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛాంపియన్' బిరుదుతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







