దుబాయ్ మెట్రో ఛాలెంజ్..Dh10,000 నగదు బహుమతి, 50gm బంగారం గెలుచుకోండి..!!
- October 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నవంబర్ 1న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని జరుపుకుంటున్నది. దుబాయ్లో వివిధ ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించే ప్రయాణికులు 1 మిలియన్ Nol+ పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు 'మిస్టిరియస్ మ్యాన్ ఛాలెంజ్' విజేతలకు విలువైన నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. అదృష్ట విజేతకు Dh10,000 నగదు బహుమతితో పాటు 50 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అక్టోబర్ 28 నుండి ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని RTA అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రజా రవాణా దినోత్సవాన్ని ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. RTA ఆరు కేటగిరీలలో ప్రజా రవాణా వినియోగదారులకు బహుమతులు అందజేస్తుంది.ప్రతి వర్గం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది.ప్రతి ఒక్కరికి 'పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛాంపియన్' బిరుదుతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









