దుబాయ్ మెట్రో ఛాలెంజ్..Dh10,000 నగదు బహుమతి, 50gm బంగారం గెలుచుకోండి..!!
- October 25, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) నవంబర్ 1న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని జరుపుకుంటున్నది. దుబాయ్లో వివిధ ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించే ప్రయాణికులు 1 మిలియన్ Nol+ పాయింట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు 'మిస్టిరియస్ మ్యాన్ ఛాలెంజ్' విజేతలకు విలువైన నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు. అదృష్ట విజేతకు Dh10,000 నగదు బహుమతితో పాటు 50 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. అక్టోబర్ 28 నుండి ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని RTA అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రజా రవాణా దినోత్సవాన్ని ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. RTA ఆరు కేటగిరీలలో ప్రజా రవాణా వినియోగదారులకు బహుమతులు అందజేస్తుంది.ప్రతి వర్గం నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తుంది.ప్రతి ఒక్కరికి 'పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛాంపియన్' బిరుదుతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







